రాష్ట్రంలో ఉన్న పది మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేదలు మరియు మధ్యతరగతి కుటుంబాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి 7 గంటలకు నిర్వహించిన మీడియా సమావేశంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈనెల 15వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్ లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టి కోటి సంతకాలను అమరావతిలోని వైసీపీ కార్యాలయానికి పంపిస్తామన్నారు.