నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో జర్నలిస్టు పిల్లల విద్యకు ఫీజులో 50% రాయితీ :జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 22, 2026
నంద్యాల జిల్లా జర్నలిస్టుల పిల్లల చదువులకు 50% ఫీజు రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొద్దిరోజులుగా జర్నలిస్టుల పిల్లల విద్యకు ఫీజు రాయితీ కల్పించాలని నంద్యాల జిల్లా ఐక్య జర్నలిస్టుల ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నారు. జర్నలిస్టుల పిల్లల విద్యలో 50% రాయితీకి సంబంధించిన జీవో ఇప్పటికే డీఈవోకు పంపించామని కలెక్టర్ సోమవారం స్పష్టం చేశారు.