హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు బుధవారం రోడ్డెక్కారు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఉద్యోగాల షెడ్యూల్ ప్రకటించి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీగా సాగిన విద్యార్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఆందోళన కారణంగా దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.