అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తైక్వాండో క్రీడాకారిణి యశస్వి భారతిని ఘనంగా సన్మానించారు. తల మీద ఆరు నిమిషాల తొమ్మిది సెకండ్లలో 100 ట్యూబులైట్లను పగలగొట్టించుకొని ప్రపంచ రికార్డు సాధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యశస్వీ భారతి, తైక్వాండో కోచ్ సాయి బాబాని గురువారం జరిగిన కార్యక్రమంలో పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. తైక్వాండో స్పోర్ట్స్ అసోసియేషన్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు యూ.శివయ్య సమక్షంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మైదుకూరు ఆంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.