నంద్యాలలో శనివారం మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మన్నరాజా ఆధ్వర్యంలో జాతీయ మెగా లోక్ అదాలత్ జరిగింది. మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసుల్లో భాగంగా ఒక కేసులో బాధితులకు అత్యధికంగా రూ.50 లక్షల పరిహారం లభించిందని న్యాయమూర్తి తెలిపారు. లోక్ అదాలత్లో దాదాపు 100 రోడ్డు ప్రమాద కేసులను పరిష్కరించడం హర్షణీయమని న్యాయవాది విజయ శేఖర్ రెడ్డి పేర్కొన్నారు.