ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు :పెసలదిన్నె గ్రామంలో కొత్తగా మంజూరైన వితంతు పింఛన్లను పంపిణీ చేసి, 'రైతన్న మీ కోసం నిర్వహించిన ఎమ్మెల్యే బీవీ
ఎమ్మిగనూరు పరిధిలోని పెసలదిన్నె గ్రామంలో ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి మంగళవారం పర్యటించారు.గ్రామంలో కొత్తగా మంజూరైన వితంతు పింఛన్లను పంపిణీ చేసి, 'రైతన్న మీ కోసం' కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో నిర్మించిన కొత్త సీసీ రోడ్డు, మినీ గోకులం షెడ్డును ఆయన ప్రారంభించారు. అర్ధరాత్రి వచ్చినా అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు.