టిడిపి అధిష్టానం రాష్ట్రంలోని పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ అధ్యక్షుల నియామకాలు చేపట్టింది. ఇందులో భాగంగా రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడిగా రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు రెండవ కుమారుడు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబును నియమించింది.ఈ నియామకంతో రాయచోటి పట్టణంలోని ప్రసాద్ బాబు నివాసం వద్ద టిడిపి శ్రేణులు సంబరాలు నిర్వహించారు. బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు. రాయచోటి తో పాటు చుట్టుపక్కల మండలాల నుంచి టిడిపి కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రసాద్ బాబును ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు