హనుమంతునిపాడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉపాధి కూలీలకు నష్టం కలిగించే జీవో నెంబర్ 197ను కేంద్ర ప్రభుత్వం తక్షణం రద్దు చేయాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జీవో నెంబర్ 197 రైతులను ఉపాధి కూలీలు దగ్ధం చేసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీవోను తక్షణం రద్దు చేయాలని, లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.