నంద్యాల అర్బన్: గుంతకల్లు- మార్కాపురం నూతన రైలును ప్రారంభించిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | May 12, 2026
గుంతకల్లు నుంచి మార్కాపురం వరకు నడిచే ప్యాసింజర్ ట్రైన్ను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గుంతకల్లు రైల్వే స్టేషన్లో మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. డోన్, బేతంచెర్ల, నంద్యాల మండలాల ప్రజలకు ఈ ట్రైన్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. శబరి ట్రైన్లో ప్రయాణికులతో కాసేపు మాట్లాడారు.