ఒంగోలు అర్బన్: పేకాట ఆడుతున్న ఐదు మందిని అదుపులోకి తీసుకున్న ఒంగోలు టాస్క్ ఫోర్స్ అధికారులు, నగదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
Ongole Urban, Prakasam | Apr 7, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో పోలీసులు పేకాట కోడిపందాలపై నిఘా పెట్టారు. ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు పేకాట ఆడుతున్న ఐదు మందిని పామూరు మండలంలో అదుపులోకి తీసుకున్నారు. రూ.10,010 నగదు నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని ఎక్కడన్నా పేకాట ఆడుతున్నట్లు గుర్తిస్తే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.