అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని కళ్యాణదుర్గం ఆర్డీవో వసంత బాబు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ తహసిల్దార్ కార్యాలయంలో పీజీ ఆర్ఎస్ కు సంబంధించి, భూముల రీ సర్వే, హౌసింగ్ సంబంధించి ఇతరత్రా వాటిపై చర్చించారు. కార్యాలయాని లబ్ధిదారులతో మాట్లాడడం జరిగిందని. ఇదివరకు ఇల్లు వచ్చిన వారితో ఇతరత్రా ఈ కేవైసీ లింక్ కావడంతో సమస్యలు ఏర్పడ్డాయని త్వరలోనే పరిష్కరించే విధంగాచర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దారు అనిల్ కుమార్, డీటీలు గురుబ్రహ్మ, మధుసూదన్ రావు,ఆర్ ఐ నాగేష్ విఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.