ఒంగోలు అర్బన్: ఒంగోలు మండలంలోని కరవాది రైల్వే స్టేషన్ మధ్య రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Ongole Urban, Prakasam | May 17, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి కరవది రైల్వే లైన్ మధ్య గుర్తు తెలియని 50-55 సంవత్సరాల వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతిచెందాడు. మృతుడి వద్ద చెన్నై ఎగ్మోర్ నుంచి బ్రహ్మపూర్ (ఒడిస్సా) వరకు జనరల్ రైల్వే ప్రయాణపు టికెట్ ఉంది. మృతుడు గ్రే కలర్ లోయర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. వివరాలు తెలిస్తే తమకు తెలపాలని ఒంగోలు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.