అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటికలపల్లి వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల సమయంలో పూలే భవనంలో యోగివేమన జయంతి వేడుకల్లో ఇంచార్జ్ ఉపకులపతి అనిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ ఉపకులపతి అనిత మాట్లాడుతూ యోగివేమన్నా మనిషి జీవితంలో జరిగే అనేక సంఘటనలను ఆధారంగా చేసుకుని అది వేలకు పైగా ఆయన వేమన్న శతకాలను రచించడం జరిగిందని అటువంటి గొప్ప వ్యక్తిని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని ఇన్చార్జి ఉపకులపతి అనిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ వెంకటనాయుడు ప్రిన్సిపల్ ఆంజనేయులు ప్రొఫెసర్లు విద్యార్థులు పాల్గొన్నారు.