అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో సోమవారం ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం కార్యక్రమంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉరవకొండ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి పేదలకు విద్య వైద్యం దూరం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు.