ఒంగోలు అర్బన్: ప్రతి వర్షపు నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవడమే జలధార లక్ష్యం: జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 4, 2026
ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న "జలధార–జల హారతి" కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు పిలుపు నిచ్చారు. చీర్వానుప్పలపాడు గ్రామపరిధిలో జలధార - జలహారతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పంట కాలువల పునరుద్ధరణ పనులను బుదవారం జిల్లా కలెక్టర్ రాజాబాబు, స్థానిక శాసన సభ్యులు బి ఎన్ విజయకుమార్ తో కలిసి స్వయంగా పోక్లైనర్ నడుపుతూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షం ద్వారా వచ్చే ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలియజేశారు