అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో బీసీ కాలనీలో గురువారం నాలుగు గంటల 15 నిమిషాల సమయంలో అంగన్వాడీ కేంద్రం వద్ద ఐసిడిసి పిడి అరుణకుమారి సిడిపిఓ ఉమాశంకర్ ఆధ్వర్యంలో బాల్యవివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిసి పిడి అరుణకుమారి సిడిపిఓ ఉమాశంకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో 18 సంవత్సరాలు దాటిన తర్వాత అమ్మాయిలకు 21 ఏళ్లు నిండిన తర్వాత అబ్బాయిలకు వివాహాలు చేయాలని అలా కాదని ఎవరైనా వివాహాలు చేస్తే 108 కు ఫిర్యాదు చేస్తే తగు చర్యలు తీసుకుంటామని ఐసిడిఎస్ పిడి అరుణకుమారి సిడిపిఓ ఉమా శంకరమ్ తదితరులు గ్రామస్తులకు తల్లిదండ్రుల కు అవగాహన కల్పించడం జరిగింది.