మంత్రాలయం:కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన ఆదోని ని జిల్లాగా ప్రకటించాలని సోమవారం మంత్రాలయం మండల కేంద్రంలోని రాఘవేంద్ర కూడలిలో ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తే సాగునీరు తాగునీరు, మరియు నిధులు పుష్కలంగా వస్తాయని నాయకులు ప్రజలకు వివరించారు. ఆదోని జిల్లాగా ప్రకటించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని తెలిపారు. ఈ ధర్నాతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.