వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి బేతంచెర్ల తాసిల్దార్ నాగమణి
Dhone, Nandyal | May 21, 2026 ప్రస్తుత వేసవికాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ నాగమణి సూచించారు.ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని తెలిపారు. ఒకవేళ బయటకు రావాల్సి వస్తే తప్పనిసరిగా గొడుగు, టోపీ లేదా తలకు టవల్ ధరించి తిరగాలని సూచించారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.