ఒంగోలు అర్బన్: శిద్దా కు డాక్టరేట్ ప్రకటించిన అమెరికన్ యూనివర్సిటీ
Ongole Urban, Prakasam | Jun 21, 2026
ప్రముఖ గ్రానైట్ వ్యాపార,పారిశ్రామిక వేత్త,మాజీ మంత్రి శిద్దా రాఘవ రావు కి అమెరికాకు చెందిన ప్రఖ్యాత టాప్ లెవెల్ విద్యా సంస్థ మేరీ ల్యాండ్ యూనివర్సిటీ అరుదైన డాక్టరేట్ బిరుదు ప్రకటించింది.ప్రపంచ వ్యాప్తంగా సమాజానికి ఉత్తమ సేవలు,ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ,బిజినెస్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై విశేష సేవలు అందించినందుకు ప్రతిఫలంగా శిద్దా రాఘవ రావు సేవలు స్వయంగా గుర్తించిన మేరీ ల్యాండ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సోఫియా నుబాని,చాన్సలర్ డా.జాన్ ఎన్.కలరస్ సంయుక్తంగా రాఘవరావు కి డాక్టరెట్ ను ప్రకటించారు.ఈ మేరకు ఆదివారం ఒంగోలు రైస్ మిలర్స్ అసోసియేషన్ హల్ లో వక్తలు అభినందించారు