పెద్దవూర: నాగార్జునసాగర్ ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తిన అధికారులు
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వర్గ ప్రవాహం కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు సోమవారం పట్టణంలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 587.60 అడుగులకు చేరిందన్నారు. అధికారులు ప్రాజెక్టు 20 గేట్లను ఐదు అడుగుల మేర దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,00,058 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా అంతే మొత్తంలో అవుట్ లో ఉంది జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతున్నట్లు తెలిపారు.