పాణ్యం: 18వ సీఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలి కల్లూరు అర్బన్ సెరీన్నగర్లో జెండా ఆవిష్కరణ
సీఐటియు 18వ అఖిల భారత మహాసభల పిలుపులో భాగంగా కల్లూరు అర్బన్ సెరీన్నగర్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం జెండా ఆవిష్కరణ నిర్వహించారు. సంఘం అధ్యక్షులు ఎస్. జనాలజీన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎన్. ప్రభాకర్ జెండాను ఎగురవేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మిక సంఘ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు