కేశంపేట: ప్రతి గ్రామంలో చెరువులపై పూర్తి హక్కు ముదిరాజ్ మత్స్యకారులదే: ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు బోల యాదగిరి
ప్రతి గ్రామంలో చెరువులు కుంటలపై పూర్తి హక్కు ముదిరాజ్ మత్స్యకారులకే ఉంటుందని ముదిరాజ్ సంఘం తలకొండపల్లి మండల అధ్యక్షుడు యాదగిరి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం వెల్జాల్, తలకొండపల్లి గ్రామాల్లోని చెరువుల్లో చేపలను పట్టడం జరిగిందని వారు అన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని, ముదిరాజ్ మత్స్యకారులందరూ చెరువుల్లో చేపల ద్వారా జీవనోపాధి పొందాలని కోరారు.