అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని తాటిచెర్ల గ్రామంలో శనివారం నాలుగు గంటల 15 నిమిషాల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత స్వర్ణాంధ్ర కార్యక్రమం,తాగునీటి ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ తాటిచెర్ల గ్రామంలో 30 లక్షల రూపాయలతో తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగిందని అదేవిధంగా పాఠశాలల్లో స్వర్ణాంధ్ర సత్యాంధ్ర కార్యక్రమం నిర్వహించి విద్యార్థినిలకు గ్రామస్తులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరిగిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు