అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని దుద్దేకుంట గ్రామస్తులు మండల అధికారులు వివిధ పార్టీల నాయకులు సహచర వైద్యాధికారులు వైద్యాధికారి కార్తీక్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు. హంద్రీనీవా కాలువలో గల్లంతై మృతి చెందిన కార్తీక్ రెడ్డి మృతదేహాన్ని అనంతపురంలో పోస్ట్ మార్టం అనంతరం మంగళవారం దుద్దేకుంట గ్రామానికి తీసుకువచ్చారు. కార్తీక్ రెడ్డి మృతదేహానికి బెలుగుప్ప పి హెచ్ సీ అధికార యంత్రాంగం తో పాటు వివిధ శాఖల మండల అధికారులు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు, పూలమాలలు వేసి నివాళులర్పించారు.