తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ మూడో తేదీన నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని టి యు డబ్ల్యూ జే, ఐజేయు మేడ్చల్ జిల్లా కూకట్పల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లాకు సంబంధించిన జర్నలిస్టులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ విచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.