విద్యా రంగంలో ఎన్జీవోల జోక్యం పెరగడం ఆందోళనకరమని TSUTF రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ. వెంకట్ అన్నారు. ఇది పరోక్షంగా ప్రైవేటీకరణకు దారితీసే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయ నియామకాలతో నాణ్యమైన విద్య అందించాలని డిమాండ్ చేశారు. టెట్పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా కేంద్రం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.