బనగానపల్లె: మిక్కినేని పల్లెలో 'వన్ మంత్ -ఫోర్ విజిట్ '
నంద్యాల జిల్లా సంజామల మండలం మిక్కినేనిపల్లిలో తహశీల్దార్ చంద్రశేఖర్ 'వన్ మంత్-ఫోర్ విజిట్స్' కార్యక్రమం నిర్వహించారు. గురువారం నిర్వహించిన తొలి విడతలో ప్రజల నుంచి భూసమస్యలపై వినతులు స్వీకరించారు. రెండో, మూడో విడతల్లో క్షేత్రస్థాయి విచారణ చేపట్టి, చివరి విడతలో సమస్యలను పరిష్కరిస్తామని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.