అనంతపురం అర్బన్: కదిరి మండలంలోని కుమ్మరవాండ్ల పల్లి లో జరిగిన పేలుడులో గాయపడిన వ్యక్తిని అనంతపురం ఆసుపత్రికి తరలింపు
Anantapur Urban, Anantapur | Apr 15, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని కదిరి నియోజకవర్గం కదిరి మండలంలోని కుమ్మరవాండ్ల పల్లిలో బుధవారం మధ్యాహ్నం జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన కుమ్మరవాండ్లపల్లి గ్రామానికి చెందిన అశోక్ కుమార్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 108 సహాయంతో తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.