నందికోట్కూరు: పచ్చందాల్లో సప్త నదుల సంగమేశ్వర ఆలయం
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని సప్త నదుల సంగమేశ్వర ఆలయం పచ్చందాల్లో దర్శనమిస్తుంది, ఒకవైపు పొలాల పచ్చదనం, మరోవైపు నది ప్రవాహంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది, 8 నెలల పాటు జలాధివాసంలో ఉండి కేవలం నాలుగు నెలలు మాత్రమే సంగమేశ్వరుడు దర్శనమిస్తాడు, వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో వేప దారు శివలింగం ఇక్కడి ప్రత్యేకతను సంతరించుకుంది, ఆలయం బయటపడడంతో ఆంధ్ర తెలంగాణ వివిధ రాష్ట్రాల నుంచి సంగమేశ్వర ఆలయాన్ని భక్తులు దర్శిస్తున్నారు