ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో అదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశం కోసం ఈ పరీక్ష జరిగింది. విద్యార్థినులు పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. పోలీస్ సిబ్బంది హాల్ టికెట్లను పరిశీలించి లోపలికి అనుమతించారు.