శేరిలింగంపల్లి ఎమ్మార్వో కార్యాలయానికి మాగంటి మాలనీదేవి, తారక్, మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి వచ్చారు. మాగంటి సునీత తరఫున అడ్వకేట్తో కలిసి విచారణకు చిన్నకూతురు దిశిర హాజరు కాగా.. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ విషయంలో కుటుంబంలో వివాదం నెలకొంది. మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలనీదేవి కుమారుడు తారక్ ఫిర్యాదుతో సర్టిఫికెట్ను రెవెన్యూ అధికారులు రద్దు చేయగా.. స్టేట్మెంట్ను ఎమ్మార్వో రికార్డు చేశారు.