ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఐదో తరగతి కోసం ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం కోసం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు పరీక్షలు జరిగాయి. మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర గంటల వరకు ఐఐటి నీట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పరీక్షలకు హాజరయ్యారు.