అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో సోమవారం రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె లో రోడ్ల నిర్మాణానికి 18 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. రోడ్ల పనులన్నీ ఇప్పటికే దాదాపుగా పూర్తి చేశామన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో రహదారులను పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు. గుంతలు లేని రోడ్లుగా చేయడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా పాల్గొన్నారు.