హనుమంతునిపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో చర్చి 27వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు మరియు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఏసుక్రీస్తు చూపిన శాంతి, సహనం ,ప్రేమ మార్గం ప్రతి ఒక్కరికి అనుసరనీయమన్నారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ ఆచరించదగ్గమని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో చర్చి పాస్టర్ లతో పాటు స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.