స్వస్థ నారీ - సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: అమలాపురంలో జేసీ నిషాంతి
కేంద్ర ప్రభుత్వం మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కొరకు మెరుగైన వైద్య సేవల ద్వారా కుటుంబాలను, తద్వారా సమాజాన్ని బలోపేతం చేసే దృఢమైన లక్ష్యంతో స్వస్థ నారీ - సశక్త్ పరివార్ అభియాన్ ను కేంద్రం రూపకల్పన చేసిందని జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాంతి తెలిపారు. అమలాపురం కలెక్టరేట్ నందు ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని ఆదేశించారు.