పుట్టపర్తి శిల్పారామంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా నృత్య నీరాజన కార్య క్రమం నిర్వహించారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ప్రత్యేక కార్యక్రమాలు 8గంటల వరకు జరిగాయి.అనంతపురం శ్రీదేవి కూచిపూడి కళాక్షేత్రం బృందం వారు కూచిపూడి నృత్యం ప్రదర్శించారు . శిల్పారామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఇంచార్జి మంత్రి సత్యప్రసాద్, బీసీ సంక్షేమ జౌళి శాఖ మంత్రి సావిత్రమ్మ, బీజేపీ నాయకుడు విష్ణు వర్ధన్ రెడ్డితో కలిసి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సందర్శించి ప్రారంభించారు.