రాజేంద్రనగర్: గుండ్లను పోచంపల్లి లో ప్రహరీ గోడ కూలి ఒకరు మృతి
గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో ఆదివారం కురిసిన వర్షానికి వీ కన్వెన్షన్ హాల్ ప్రహారీగోడ సోమవారం తెల్లవారుజామున కూలింది. గోడకు ఆనుకొని అపర్ణ ఆర్ఎంసీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు షెడ్లు వేసుకొని నివాసముంటున్నారు. ఒక్కసారిగా షెడ్లపై గోడ కూలి నిద్రిస్తున్న కార్మికులపై పడింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.