ఒంగోలు అర్బన్: ప్రభుత్వం బకాయిలను తక్షణం చెల్లించకపోతే భారీ ఆందోళనలు తప్పవు: ఏపీ ఎన్జీవో సెక్రటరీ
Ongole Urban, Prakasam | Apr 21, 2026
ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించకపోతే భారీ ఆందోళనలు తప్పవని ఏపీ ఎన్జీవో సెక్రటరీ కృష్ణారెడ్డి తెలిపారు మంగళవారం ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులతో కలిసి ధర్నాలో పాల్గొన్న ఏపీ ఎన్జీవో నేతల మాట్లాడుతూ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ను అమలు చేయాలన్నారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఉపాధ్యాయ యూనియన్ నేత మాట్లాడుతూ ఒకే డీఎస్సీ పరీక్ష ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులను రకరకాల తో విభజించి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు ఎస్ఎస్సి లో పనిచేసే ఉద్యోగులకు 60 శాతం జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు చేయాలన్నారు