గుడిపల్లి మండలంలోని గుండ్ల సాగరం గ్రామంలో ఈద్గా నిర్మాణం కోసం ప్రభుత్వం 10 సెంట్ల స్థలమాన్ని కేటాయించింది. ఈద్గా నిర్మాణానికి స్థలం కేటాయించాలంటూ ముస్లిం నేతల విజ్ఞప్తి నేపథ్యంలో PKM-UDA ఛైర్మన్ డా. సురేష్ బాబు, తహశీల్దార్ సీతారాం రెస్కో డైరెక్టర్ అమీర్ బుధవారం స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో త్వరలోనే ఈద్గా నిర్మించడం జరుగుతుందని ముస్లిం నేతలు తెలిపారు.