పెద్ద కడబూరు : మండల కేంద్రంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి సహకారంతో సోమవారం డివిజన్ స్థాయి క్రిస్టమస్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమయింది.ఈ కార్యక్రమాన్ని ఎస్సై నిరంజన్ రెడ్డి, తిక్కారెడ్డి అనుచరులు ఇంద్రసేనారెడ్డి, దశరథ రాముడు, నీలకంఠ రెడ్డి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో రాణించాలన్నారు. గెలుపు ఓటములను క్రీడాకారులు సమానంగా స్వీకరించాలన్నారు.