జీవో నెంబర్ 322ను వెంటనే ఉపసంహరించుకోవాలి : సహకార సంఘ ఉద్యోగులు
Ongole Urban, Prakasam | May 12, 2026
సహకార సంఘ ఉద్యోగులు సమ్మె సందర్భంగా రాష్ట్ర సహకార శాఖ మంత్రి అచ్చం నాయుడు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని హామీలకు విరుద్ధంగా ఇచ్చిన జీవో 322 ని వెంటనే ఉపసంహరించాలని లేనిపక్షంలో ఆందోళన బాట పట్టవలసి వస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల సంఘం (సిఐటియు) రాష్ట్ర ఉపాధ్యక్షులు పి హనుమంతరావు హెచ్చరించారు. మంగళ వారం ప్రకాశం జిల్లా కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎదుట సహకార ఉద్యోగులు నాయకత్వాన ప్రభుత్వం విడుదల చేసిన జీవో 322 కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమానికి యూనియన్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు వి మనోజ్ అధ్యక్షత వహించారు