"స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కండి : కమీషనర్
"స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పిలుపునిచ్చారు.కార్పొరేషన్ పరిధిలో పది ప్రాంతాల్లో పర్యావరణహిత అవగాహన సైకిల్ ర్యాలీలు, మొక్కలు నాటే కార్యక్రమాలను శనివారం చేపట్టారు. అందులో భాగంగా స్థానిక ఎస్పీ బంగ్లా నుంచి బట్వాడి పాలెం కూడలి వరకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల నేతృత్వంలో నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని నిర్వహించారు.