నంద్యాల జిల్లా అవుకు మండల పరిధిలో శుక్రవారం ప్రమాదవశాత్తు కారు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. స్థానికుల వివరాల మేరకు.. నంద్యాల వైపునుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న కారు అవుకు- ఉప్పలపాడు ఆర్చి సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పంట పొలాలలోని దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పి, కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.