నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని సప్త నదుల సంగమేశ్వర ఆలయ శిఖరం సోమవారం బయటపడింది, ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామయ్య శర్మ శిఖరం వద్దకు పడవలో చేరుకుని శిఖరానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు,పాల్గుణ మాసం శుక్ల చతుర్దశి సోమవారం సప్త నదుల సంగమేశ్వర శిఖరం బయటపడడం విశేషమని పేర్కొన్నారు, 2020-2021 లో కూడా శిఖరం ఇలాగే బయటకు వచ్చిందని ఆయన వెల్లడించారు, శ్రీశైలం బ్యాక్ వాటర్ లో 857 అడుగులకు నీరు చేరడంతో శిఖరం బయటకు కనిపించిందని ఆయన పేర్కొన్నారు