అనంతపురం నగర శివారులోని తపోవనం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి బావబామ్మర్దికి గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 13, 2026
అనంతపురం నగర శివారులోని జాతీయ రహదారిపై ఉన్న తపోవనం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో సింగనమల మండలం పెరవలి గ్రామానికి చెందిన నాగరాజు, అతని బావమరిది తాడిపత్రికి చెందిన రమేష్ లకు గాయాలయ్యాయి. వారిలో నాగరాజు పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.