విద్యార్థులు ఇంగ్లీష్ బాగా మాట్లాడేలా చర్యలు తీసుకోవాలని... రామాపురం మండలంలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల ఆకస్మిక తనిఖీ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్.... విద్యార్థులు ఇంగ్లీష్ బాగా మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించేలా చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థినీ విద్యార్థులు తరగతి గదులలో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నప్పుడు రాసుకున్న నోటు పుస్తకాలను తనిఖీ చేశారు. విద్యార్థులు రాసుకుంటున్న నోటు పుస్తకాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సరిగా రాసుకుంటున్నారా లేదా అనే అంశంపై దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు