అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గుండ్లపల్లి గ్రామంలో మండల తహసిల్దార్ అనిల్ కుమార్ డిప్యూటీ ఎంపీడీవో ఏకాంబరేశ్వరయ్య ఎంఈఓ టు హరికృష్ణ తదితరులు వివిధ శాఖల అధికారులతో కలిసి పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలు అన్యాయానికి గురి అయితే పోలీసులను ఆశ్రయించాలని అనవసరంగా ఎస్సీ ఎస్టీ చట్టాలను దుర్వినియోగం చేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ డబ్ల్యు ఓ నాగరాజు, విఆర్ఓ రమేష్, పోలీసులు తదితరులు పాల్గొన్నారు