కంగుందిలో జనవరి 6 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించే బౌల్డరింగ్ ఫెస్టివల్ పోస్టర్ను మంత్రి నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. కుప్పం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. కంగుందిలో బౌల్డరింగ్ ఫెస్టివల్ను కడ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ ఫెస్టివల్కు రావాలని మంత్రికి ఆహ్వానం పలికినట్లు APEWIDC ఛైర్మన్ రాజశేఖర్ తెలిపారు.