అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాసంలో గురువారం ఉదయం 11:30 గంటల నుంచి సాయంకాలం 7:30 గంటల వరకు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి నూతన సంవత్సరం సందర్భంగా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన వైసిపి నేతలు కార్యకర్తలు గజమాలను వేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైసిపి పార్టీ ఓటమి చెందిన నియోజకవర్గంలో ప్రజలు మమ్మల్ని గుర్తుంచుకున్నారని నేడు వేలాదిమంది వైసీపీ నేతలు ప్రజలు శుభాకాంక్షలు చెప్పడం ఆనందంగా ఉందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.