అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పాపంపేట నరిగెమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం 8:30 గంటల సమయంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు రాజేష్ యువనేత భారత ఆధ్వర్యంలో నరిగమ్మ అమ్మవారి ఆలయం తరలించకూడదని మహిళలతో కలిసి లక్ష వత్తులు కలిగిన దీపాలను వెలిగించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి అధ్యక్షుడు రాజేష్ భరత్ తదితరులు మాట్లాడుతూ నరిగమ్మ అమ్మవారి ఆలయం తరలించకూడదని మహిళలతో కలిసి లక్ష వత్తులు కలిగిన దీపాలను వెలిగించి పూజలు నిర్వహించడం జరిగిందని ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఆలయాన్ని తరలించకూడదని తరలిస్తే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని బిజెపి నేతలు రాజేష్ భరత్ పేర్కొన్నారు.